విద్యుత్‌శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

జీతాలు 37 శాతం పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ 

తాడేప‌ల్లి: విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ ఆదేశాల మేర‌కు విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు విద్యుత్ శాఖ సీఎస్ తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించింది. 
 

తాజా వీడియోలు

Back to Top