విశాఖ‌లో ‘మారిటైమ్‌ ఇండియా’‌ సదస్సు ప్రారంభం 

 వర్చువల్‌ ద్వారా పాల్గొన్న సీఎం వైయ‌స్‌ జగన్‌

‌  
తాడేప‌ల్లి: మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సు విశాఖ‌లో ప్రారంభ‌మైంది. ఈ నెల 4వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే ఈ స‌మ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్‌ ద్వారా  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్‌ తదితర దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.  పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే అవ‌కాశం ఉంది.

Back to Top