దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం వైయస్ జగన్
18 Jul 2022 11:12 AM
తాడేపల్లి: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పీవీ సింధును ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ ఏడాది మూడో టైటిల్ను సొంతం చేసుకున్న సింధును సీఎం జగన్ కొనియాడారు. ఆమె ఘనత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై పీవీ సింధు గెలుపొందింది.
వాంగ్ జి యిపై 21-9, 11-21, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. రెండో సెట్లో ఓడిపోయింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు.. ఈ ఏడాదిలో తొలి సూపర్ 500 టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, సింధుకు ఈ ఏడాది ఇది మూడో టైటిల్. అంతకుముందు సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్లను గెలుచుకుంది. ఆమెకు ఇది సింగపూర్ ఓపెన్ తొలి టైటిల్.