పలు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం

 సీఎం  వైయస్.జగన్అ ధ్యక్షతన  ఎస్ఐపీబీ సమావేశం 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ప‌లు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సీఎం  వైయస్.జగన్అ ధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో     పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తిచేసిన, అవి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.  నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలన్న ముఖ్యమంత్రి.  రానున్న ప్రతి పరిశ్రమలో కూడా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని మరోసారి స్పష్టంచేశారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.     
 
మరిన్ని ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం:

 అవిశా  ఫుడ్స్‌ మరియు ఫ్యూయెల్స్‌ కంపెనీ:
-    కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా  ఫుడ్స్‌ మరియు ఫ్యూయెల్స్‌ కంపెనీ ప్రతిపాదన.
-    మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి. రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం
-    ఈ ఏడాది జూన్ లో పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

 ఆంధ్రా పేపర్ మిల్స్‌ విస్తరణ:
- కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు.
- మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు
- ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు.
- 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

  న్యూ ఎనర్జీ పార్కు:
- ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు
- మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి.
- మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి.
- ఫేజ్ వన్‌లో  30 వేలమందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు.
- ఈ పార్క్ లో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్, హైడ్రోజన్‌ సంబంధిత ఉత్పత్తులు.
- మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 20౩౩ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.
- ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ఎన్టీపీసీ.

 ఎలక్ట్రో  స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌… ఫ్యాక్టరీలు:
- శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో  స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌… ఫ్యాక్టరీలు.
- డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ
- శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి.
- మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి.
- ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు.
- డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యం.

 అకార్డ్‌ గ్రూప్‌ ఫ్యాక్టరీ:
- రామాయపట్నంలో అకార్డ్‌ గ్రూప్‌ ఫ్యాక్టరీ.
- రూ. 10వేల కోట్ల పెట్టుబడి.
-కాపర్‌ కాథోడ్, కాపర్‌ రాడ్, సల్ఫూరిక్‌ యాసిడ్‌, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాల తయారీ. 
- ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు.
- మే 2023లో ప్రారంభమై, జూన్2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

శ్రీ వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను నిషేదించిన నేపధ్యంలో తమ కంపెనీ ప్రణాళికలను మార్చుకున్న జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్‌
ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదన
ఆమోదించిన ఎస్‌ఐపీబీ

 విండ్,  సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు:
-     కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ మరియు  సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు
-    1000 మెగావాట్ల విండ్, మరియు 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు 
-    ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌.
-    నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్లపెట్టుబడి.
-    2వేలమందికి  ఉద్యోగాలు.
- దశల వారీగా పూర్తిస్ధాయిలో    మార్చి 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

-    ఈ ప్రభుత్వం వచ్చాక… విద్యుత్ ప్రాజెక్ట్‌ల విధానంలో కీలక మార్పులు తీసుకు వచ్చామన్న సీఎం.
-    పవర్‌ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి.
-    తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31వేలు లీజు కింద చెల్లింపులు: సీఎం
-    దీనివల్ల కరవు ప్రాంతాల్లోని రైతులకు చక్కటి మేలు జరుగుతుంది:
-    అంతేకాదు.. ప్రతి మెగావాట్ కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయి: 
-    ఎస్జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది:
-    గ్రిడ్ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవు:
-    దీంతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి: సీఎం

 100 మెగావాట్ల డేటా సెంటర్:
-    విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్.
-    100 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌   .
-    మొదటి విడతలో 10 మెగావాట్లతో డేటా సెంటర్‌, మూడేళ్ళలో పూర్తికి కంపెనీ సన్నాహాలు. 
-    మొత్తంగా రూ.7,210 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి, మొత్తంగా 20,450 మందికి ఉద్యోగాలు.
-    ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్ కి ఇది అదనం. 

 వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌:
- రాష్ట్రంలో పెట్టబుడులకు ముందుకు వచ్చిన వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
-    రూ. 1489.23కోట్ల పెట్టుబడి. తిరుపతిలో పరిశ్రమ.
-    15 వేలమందికి ఉద్యోగాలు.
-    టెలీ కమ్యూనికేషన్ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ ను తయారుచేస్తున్న కంపెనీ. 

 ఐటీ పార్కు ఏర్పాటు:
-    భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటు.
-    దీనికి ఎస్ఐపీబీ ఆమోదం.
-    అత్యంత ఆధునిక  సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని సీఎం ఆదేశం.
-    ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆమేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్న సీఎం.
స‌మావేశంలో ఉపముఖ్యమంత్రి ( పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్ధిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్‌ ప్రాససింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పరిశ్రమలుశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ (వాణిజ్య పన్నులు) స్పెషల్‌ సీఎస్‌ రజత్‌భార్గవ , ఇంధన శాఖ  స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె ప్రవీణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్, పరిశ్రమలుశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీపీసీబీ మెంబర్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ఎండీ షన్‌మోహన్, ఎన్‌ఆర్‌ఈడీసీఎపి వీసీ అండ్‌ ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Back to Top