అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
'అమ్మ ఒడి'కి జర్మన్ నోబెల్ గ్రహీత ప్రశంస
28 Jan 2020 4:07 PM
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'అమ్మ ఒడి' పథకాన్ని నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బి గుడెనఫ్ ప్రశంసించారు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి, మనిషి మట్టిలో కలిసిపోయేంత వరకూ మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలనే తత్వాన్ని పాటించాలనే గుడెనఫ్ మానవాళి ప్రగతికి తనవంతు కృషి చేశారు. ప్రస్తుతం మన వాడే స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు తదితరాల్లో వాడే లిథియమ్ ఇయాన్ బ్యాటరీల్లో క్యాథోడ్ ను ఆవిష్కరించింది ఈ మేధావే. 98 యేళ్ల ఈ వరల్డ్ క్లాస్ ఇన్వెంటర్ దృష్టికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'అమ్మ ఒడి' పథకాన్ని తీసుకెళ్లింది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగం.
భారత్ వంటి దేశంలో పిల్లలను చదువుకు పంపించే తల్లికి ఆర్థిక స్వావలంభన కలిగించే పథకాన్ని ఈ నోబెల్ గ్రహీత ప్రశంసించారు. నేర్చుకోవడం మనిషి విధి అనే ఈ నోబెల్ గ్రహీతకు ఇండియాలో పరిస్థితులు ఏమీ తెలియనివి కావు. మన దగ్గర నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా ఎంతో మంది పిల్లలకు ఆర్థిక శక్తి లేక మంచి చదువులు చదివే అవకాశం లేకుండా పోతోంది. ఇదే ఇండియాకు పెద్ద శాపం కూడా. ఇలాంటి నేపథ్యంలో అమ్మ ఒడి వంటి పథకం ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికీ పిల్లలను బాల కార్మికులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను చదువుకు పంపించే తల్లికి ఆర్థిక సాయం చేస్తూ ఉంది. ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లులకు అది ఫీజులకు, ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపించే వాళ్లకు పోషణకు పని కొచ్చే స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని ఒక నోబెల్ గ్రహీత కూడా ప్రశంసించారు. ఒక వీడియో మెసేజ్ ను కూడా విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’ పథకం లక్షలాది మంది నిరుపేద తల్లుల ముంగిటకు చేరింది. అక్షరాస్యత పెంపు లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘అమ్మ ఒడి’ని ప్రారంభించిన రెండు, మూడు రోజుల్లోనే అర్హులైన లక్షలాది మంది తల్లుల చేతికి నిధులు అందాయి. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని చిత్తూరులో ప్రారంభించారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదని, తమ చిన్నారులను బడికి పంపించే ప్రతి నిరుపేద తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించేలా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు 43 లక్షల మంది తల్లులకు మేలు చేకూర్చేలా తొలి బడ్జెట్లోనే అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్ల నిధులు కేటాయించారు. పథకం ప్రారంభానికి ముహూర్తాన్ని నిర్ణయించి నెల రోజుల్లోపే అర్హుల ఎంపికను పూర్తి చేశారు.