మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
మత్స్యకారులకు మంచి రోజులు
20 Nov 2019 6:33 PM
దుర్భర జీవితాలు గడుపుతున్న మత్స్యకారులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
వేట నిషేధ సమయంలో గతంలో రూ.2 వేల భృతి
పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు కళ్లారా చూసిన వైయస్ జగన్
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీ అమలు
21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
అమరావతి: ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం లెక్క చేయక చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. ఏ పొద్దుకాపొద్దు వేట చేసి తీసుకువచ్చే మత్స్య సంపదను అమ్మితే గానీ బతుకు నడవని మత్స్యకారుల ఆకలి కేకలు గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టీపట్టనట్లుగా ఉండటంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని స్థితిలో ఉండేవారు. వేట నిషేధ కాల భృతి సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పులతో జీవనం సాగిస్తూ బతుకు నావను దుర్భరంగా నెట్టుకొచ్చేవారు. అలాంటి మత్స్యకారుల ఘోషను జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో కళ్లారా చూసి చలించిపోయారు. వారి బతుకుల్లో వెలుగులు తెస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నెరవేర్చి మనసున్న నాయకుడిగా మత్స్యకారుల మదిలో నిలిచిపోయారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.
మత్స్యకారులకు వైఎస్సార్ భరోసా
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వైఎస్సార్ భరోసాను అమలు చేయబోతుంది. ఏడాదికి పది నెలలు మత్స్యకారులకు చేపల వేట ఉం టుంది. రెండు నెలల పాటు నిషేధ కాలంలో వారికి ఉపాధి దొరకదు. ఈ రెండు నెలలు గత ప్రభుత్వం నెలకు రూ.2వేల చొప్పున రూ.4 వేలు ఆర్థిక సాయం చేసేది. అయితే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ సాయాన్ని పెంచారు. నెలకు రూ.5 వేల చొప్పున రెండు నెలలకు సంబంధించిన రూ.10 వేల సాయా న్ని వైయస్ఆర్ భరోసాగా నామకరణం చేశారు. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకా రం చుట్టనున్నారు. గతంలో యాంత్రిక పడవలు, మరపడవలకు నిషేధ కాల భృతి అమల్లో ఉంది. ఈ ఏడాది నుంచి తెప్పలు (చిన్నపడవలు)కు కూడా దీనిని విస్తరింప చేశారు. సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా మత్స్యకారులకు ఇచ్చిన హామీ నెరవేరుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.