19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
టీడీపీ లాలూచీ వెనుక అసలు రహస్యం..!?
23 Mar 2018 3:00 PM
నిప్పు నిప్పు అని చెప్పుకునే చంద్రబాబును నిప్పు కాదు తుప్పు అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక వైపు కేంద్ర నాయకులు మా వద్ద లెక్కలు ఉన్నాయి..పద్దులు ఉన్నాయి..సరైన సమయంలో బాబు చిట్టా విప్పుతామంటున్నారు. గుట్టు రట్టైతే బాబు కథ కంచికేనా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక రోజు ఎవరికి భయపడనన్న చంద్రబాబు మొన్న నాకు ఎవరిపై కోపం లేదని మెత్తపడ్డారు. నాపై దాడి చేస్తున్నారని బాధపడ్డారు. ఇక నిన్నయితే ఏకంగా ఆయన అనుచరుడు సుజనా చౌదరి జైట్లీని కలిసినట్లు బాబుగారి వీడియో కాన్ఫరెన్స్ సాక్షిగా బయటపడింది. ఇంతకు ఈ లోలోపలి గూడుపుఠాని ఇంతగా సాగడానికి కారణాలు కోకొల్లలంటున్నారు.. వాటిలో కొన్ని ఇలా..
● ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించే క్రమంలో.. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షల కోట్ల నిధులను పక్కదారి పట్టించారా..? అంతటితో ఆగక ఆ నిధులన్నింటిని హవాలా రూపంలో విదేశాలకు తరలించారా.? అందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు, మంత్రుల వాటా ఎంత..? ఈ భారీ కుంభకోణంలో 2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ, జనసేన నేతల వాటా ఎంత..? అన్న ప్రశ్నలతో కూడిన కథనం మీడియాలో ప్రసారం అవుతోంది.
● అయితే, పై ప్రశ్నలకన్నింటికీ అవుననే సమాధానం చెప్తూ, పలు ఆధారాలను కూడా జత చేస్తున్నారు. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల 434 కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ అంశం పై ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెప్పేలా ఉందనేది ప్రజల అభిప్రాయం.
● అంతే కాకుండా, ఏపీ అభివృద్ధి కోసమంటూ పలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును సీఎం చంద్రబాబు నాయుడు తన అనుచరవర్గంతో కలిసి విదేశాలకు తరలించారని, అంతేకాకుండా, విలువ మొత్తం రూ.1,25,0000 కోట్లు అంటూ మీడియా బల్లగుద్ది మరీ చెబుతోంది. అయితే, ఈ విషయాన్ని కేవలం మీడియానే కాకుండా, గురువారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్ వేదికగా మీడియా సాక్షిగా వెల్లడించారు. చంద్రబాబు అండ్ కో ఏపీ అభివృద్ధి కోసం తీసుకున్న నగదులో కొంత రూ.1,25,0000 కోట్లును విదేశాలకు హవాలా చేశారని చెప్పారు విజయసాయిరెడ్డి. ఏదేమైనా ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఇటు మీడియాతోపాటు, అటు రాజకీయ నాయకులు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీతో రాజీ చేసుకునేందుకు చంద్రబాబు తన పార్టీ నేతలను మోడీ వద్దకు పంపించారని సమాచారం చక్కర్లు కొడుతోంది.