చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
పార్టీ తరపున వైఎస్ విజయమ్మ పోరాటాలు
19 Apr 2016 3:29 PM
వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ తరుపున ప్రజల సమస్యల
మీద అనేక పోరాటాలు చేశారు. ధర్నాలు, ఆందోళనల్లో పాలు పంచుకొన్నారు.
1.
మహాధర్నా (16-07-2012): రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య
వైఖరిని నిరసిస్తూ పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో
వైఎస్ విజయమ్మ పాల్గొని,
ప్రసంగించారు.
2.
మహాధర్నా (17-07-2012): విద్యుత్ కోతలకు నిరసనగా విజయవాడ
ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ధర్నా నిర్వహించారు.
3.
చేనేత దీక్ష (23-07-2012): చేనేత కార్మికులకు సంఘీభావంగా కరీంనగర్
జిల్లా సిరిసిల్లలో ఒక రోజు చేనేత దీక్ష
4.
ఫీజు దీక్ష (13-08-2012 నుంచి 14-08-2012): ఫీజు రీయంబర్స్మెంట్పై ప్రభుత్వ వైఖరిని
నిరసిస్తూ,
పేద విద్యార్థులకు
మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెండు రోజుల దీక్ష
5.
ఫీజు పోరు దీక్ష
(06-09-2012 నుంచి 07-09-2012 వరకు): వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు
రీయంబర్స్మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకు నిరసనగా
ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల దీక్ష
6.
విద్యుత్
చార్జీలపై మహా ధర్నా (09-07-2013):
విద్యుత్
చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు
ఎస్ఈ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాల్లో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.
7.
విద్యుత్ కోతలు, కరెంటు చార్జీలపై మహాధర్నా (04-03-2013): అసాధారణమైన విద్యుత్ కోతలు, కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన మహాధర్నాలో
పాల్గొన్న షర్మిలతో కలిసి పాల్గొన్న విజయమ్మ
8.
కరెంటు సత్యాగ్రహం
(02-04-2013 నుంచి 06-04-2013 అర్దరాత్రి వరకు): పెంచిన కరెంటు
చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ న్యూ ఎమ్మెల్యే క్వార్డర్స్లో ఐదు రోజుల
పాటు దీక్ష చేసిన విజయమ్మ
9.
జగన్ అరెస్ట్
చేసిన ఏడాది పూర్తయిన సందర్భంగా (28-05-2013): ఇందిరాపార్క్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి
ఒక రోజు నిరశన దీక్ష చేశారు. దీక్షలో జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా
పాల్గొన్నారు.
10.
ఫీజు దీక్ష (18-07-2013 నుంచి 19-07-2013 వరకు): ఫీజు రీయంబర్స్మెంట్ పథకం
కోసం ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల దీక్ష
11.
రాష్ట్ర విభజనపై
కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష వైఖరికి నిరసనగా గుంటూరులో 19-08-2013 నుంచి 24-08-2013 ఉదయం 11 వరకు నిరవధిక దీక్ష చేపట్టిన వైఎస్ విజయమ్మ
12.
రాష్ట్రాన్ని సమైక్యంగా
కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించిన
వైఎస్ విజయమ్మ