తాడేపల్లి: వైయస్ఆర్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు పలువురి పార్టీ నాయకులను నూతన అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ముదలియార్ విభాగం అధ్యక్షులుగా జ్ఞాన జగదీష్, బొందిలి విభాగం అధ్యక్షుడిగా నరేంద్ర సింగ్, కృష్ణ బలిజ/ పూసల విభాగం అధ్యక్షురాలిగా కోలా భవానీ ఆర్టిజెన్ సెల్ అధ్యక్షుడిగా తోలేటి శ్రీకాంత్ ను నియమించారు.