వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మాయమాటలతో బాబు కాలం వెల్లదీస్తున్నాడు
01 Sep 2018 3:34 PM
విశాఖపట్నం: మాయమాటలు చెబుతూ చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా కాలం వెల్లదీస్తున్నాడని విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అని రైతాంగాన్ని నట్టేట ముంచాడని మండిపడ్డారు. చోడవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో స్థానిక రైతులు ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను జననేతకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో వడ్డీ లేని రుణాలు పొందామని, చంద్రబాబు వడ్డీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ హయాంలో రుణం పూర్తిగా మాఫీ అయ్యిందన్నారు.