నర్సాపురం నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీతారామాపురం క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ నరసాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం భీమవరం నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌ నరసాపురంలోకి అడుగుపెట్టారు. కొప్ప్రరు మీదుగా జననేత పాదయాత్ర కొనసాగుతోంది. వైయస్‌ జగన్‌కు బాసటగా పలువురు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
 
Back to Top