విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కొయ్యానపేట గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన జననేత కొయ్యానపేట చేరుకోగానే స్థానికులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.