<br/>విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మాడుగుల నియోజకవర్గంలోని కే.కోటపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే జననేత బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వేలాదిగా హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.