<br/>గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గరికపాడు చేరుకున్న జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా పలువురు వృద్ధులు వైయస్ జగన్ను కలిసి తమకు పింఛన్లు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. మరో ఏడాది ఓపికపడితే మనందరి ప్రభుత్వం వస్తుందని పింఛన్ నెలకు రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.