విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైయ‌స్ఆర్‌సీసీ

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చింది

రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ ప్రబలమైన పార్టీ

వైయ‌స్ఆర్‌సీపీ నా ఒక్కడిదే కాదు. కోట్లాది అభిమానులది

వైయ‌స్ఆర్‌ను గుండెలో పెట్టుకున్న ప్రతి ఒక్కరిది

శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

మహానేత వైయ‌స్ఆర్‌విగ్రహానికి పూలతో నివాళులర్పించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, 
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

వైయ‌స్ఆర్‌సీపీపై కాంగ్రెస్, టీడీపీ కుట్రలు, కుతంత్రాలు

కానీ, జగన్‌ ఏనాడూ భయపడలేదు. వెనక్కి తగ్గలేదు

జగన్‌ నమ్ముకుంది పైన ఉన్న దేవుడిది. కింద ఉన్న మిమ్మల్ని

ఆ దేవుడి ఆశీస్సులు, మీ అభిమానంతో గట్టిగా నిలబడ్డాను

విలువలు, విశ్వసనీయతకు మన పార్టీ కట్టుబడి ఉంటుంది

నాతో నడిచే ప్రతి ఒక్కరూ గర్వంగా కాలర్‌ ఎగరేసుకుని చెప్పొచ్చు

అదిగో మా పార్టీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని..

ఆ దిశలోనే వైయ‌స్ఆర్‌సీపీ అడుగులు వేస్తుంది

శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు. దీంతో జనసంద్రంగా మారిన పార్టీ కార్యాలయం.
    మహానేత వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వందలాదిగా తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:
    మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011, మార్చి 12న పుట్టిన మన పార్టీ, ఈరోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 
    15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. 
    విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేది ఒక్క జగన్‌ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైయ‌స్ఆర్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను.


    ఆరోజు జగన్‌ అనే వాడు ఒకే ఒక్కడు. కానీ, జగన్‌ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్‌ పార్టీ.. ఇక్కడ, దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్‌ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్‌కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు. కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.
    ఈరోజు నేను చెబుతున్నాను. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్‌ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైయ‌స్ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి, మరొక్కసారి మీ అందరికి కూడా వినమ్రంగా, వినయపూర్వకంగా, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
    ఈరోజు మరొక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయ‌స్ఆర్‌ను అభిమానించే ప్రతి గుండెకు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వైయ‌స్ఆర్‌ను ప్రేమించే ప్రతి గుండె, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగాన్ని ముగించారు.
    పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతిని«ధులు, సీనియర్‌ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు, పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top