ప్రకాశం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 101వ రోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. కాసేపటి క్రితం బండ్లమూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతకు ఘనస్వాగతం పలికారు. బండ్లమూడి చౌరస్తాలో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.