చిత్తూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 58వ రోజు బుధవారం ఉదయం గంగాధర నెల్లూరు నియోజకవర్గం చిప్పరపల్లి శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి జెట్టివానిఒడ్డు మీదుగా జెక్కిదొన చేరుకుని వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం గంటావారిపల్లి, బొట్లవారిపల్లి, చిన్నబొట్లవారిపల్లి మీదుగా నల్లవెంగనపల్లి, మటూరు క్రాస్ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పాతగుంట, చెన్నుగారిపల్లి, గుండుపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.<br/><br/>