జొన్నవలస నుంచి 275వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

 విజయనగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వై జంక్షన్‌, మయూరి జంక్షన్‌, రైల్వే స్టేషన్‌ మీదుగా వెంకటలక్ష్మీ జంక్షన్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.  భోజన విరామం అనంత‌రం తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మూడు లాంతర్ల సెంటర్‌ మీదుగా కొత్తపేట వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.


Back to Top