<br/>తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం వైయస్ జగన్ 213వ రోజు పాదయాత్ర షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఉదయం పెదపూడి మండలంలోని బసచేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దడ, కికవోలు, పెదపూడి వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం దొమ్మాడ, కరుకుడురు వరకు పాదయాత్ర సాగుతుంది.