శ్రీకాకుళంః వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 314వ రోజు షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు.గురువారం ఉదయం పొందూరు బసచేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి లోలుగు,నందివాడ క్రాస్, నరసపుర అగ్రహారం వరుకు సాగుతుంది. మధ్యాహ్న భోజనం విరామం అనంతరం కేశవదాసుపురం క్రాస్ మీదగా చిలకపాలెంలో జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. ఎచ్చెర్ల వరుకు పాదయాత్ర కొనసాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.