ప్రజా సంకల్పయాత్ర 341వరోజు ప్రారంభం..

శ్రీకాకుళంః  వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర 341వరోజు ప్రారంభమయింది. కొత్త కొజ్జిరియా నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్త కొజ్జీరియా,అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదగా పేటూరు,ఇచ్ఛాపురం వరుకు సాగుతుంది. ఉదయం 11 గంటలకు లొద్దకుట్టి గ్రామం వద్ద వైయ‌స్ జ‌గ‌న్ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి బయలుదేరి 1.15 గంట‌ల‌కు ఇచ్చాపురంలోని పైలాన్ వద్దకు వైయస్ జగన్ చేరుకుంటారు. పాద‌యాత్ర‌కు గుర్తుకు అక్క‌డ ఏర్పాటు చేసిన విజ‌య స్థూపాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్ లో జరిగే బహిరంగ సభ ప్రాంతానికి చేరి అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు.   

తాజా వీడియోలు

Back to Top