<strong>తూర్పుగోదావరి:</strong> ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు వైయస్ జగన్ను కలిశారు. ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదని వారి గోడు వెల్లబోసుకున్నారు. రాజోలు నియోజకవర్గం కడలిలో కొనసాగుతున్న 197వ రోజు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.