<strong>విశాఖః</strong> ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు జగనన్నకు తమ సమస్యలు చెప్పుకున్నారు. చేనేత కార్మికులు, స్టార్ట్ ఆఫ్ కంపెనీ నిర్వాహకుడు వైయస్ జగన్ను కలిశారు. ఏపీ ప్రభుత్వం స్టార్ట్ ఆఫ్ కంపెనీలకు సరైన ప్రోత్సాహాకాలు ఇవ్వడంలేదని నిర్వాహకుడు రాజశేఖర్ పాదయాత్రలో వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. మంగళగిరి చేనేత కార్మికులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. చేనేత కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మాకు మంచిరోజులు వస్తాయన్నారు.