కడుపునిండా కష్టాలు.. చిరునవ్వుతో స్వాగతం


గుంటూరు: రాజన్నబిడ్డను చూసి ఆ గ్రామ ప్రజలంతా మురిసిపోయారు. అన్నతో ఒక్కసారి సెల్ఫీ దిగేందుకు యువత, కరచాలనం చేసేందుకు ప్రజలు ఆసక్తికనబరిచారు. కడుపునిండా కష్టాలు ఉన్నా.. చిరునవ్వుతో జననేతకు స్వాగతం పలికారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 126 రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ తిరుపతిరెడ్డినగర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. 
వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తిరుపతిరెడ్డి నగర్‌ చేరుకుంది. ప్రజలంతా వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు తరలివచ్చారు. తమ కష్టాలన్నీ రాజన్న బిడ్డకు చెప్పుకొని మా మొహాల్లో సంతోషాలు నింపాలయ్యా అంటూ కోరారు.
Back to Top