<br/><br/>కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పనికి తగ్గ వేతనం అందడం లేదని, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి వైయస్జగన్ హామీ ఇచ్చారు.