మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు
20 Jan 2017 12:17 PM
సూళ్లూరుపేటః గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నామని కేసీఎన్ గుంట గ్రామానికి చెందిన మహళలు ఎమ్మెల్యే సంజీవయ్యకు మొరపెట్టుకున్నారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కె. సంజీవయ్య కేసీఎన్ గుంట పంచాయతీలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రజాబ్యాలెట్ అందజేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు గ్రామాల్లో తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. కేసీఎన్ గుంటలో ఓవర్ హెడ్ ట్యాంకు ఉండి కూడ నిరుపయోగంగా వదిలేయడమేంటని ప్రశ్నించారు. నాయుడుపేట నగర మున్సిపాలిటీ తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మోసపూరిత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సంజీవయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.