నెల్లూరులో యువభేరి

నెల్లూరుః ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా వైయస్సార్సీపీ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది.  వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరులో జరగనున్న ‘యువభేరి’ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్థానిక కస్తూరి దేవి గార్డెన్స్‌లో  జరిగే యువభేరిలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి యువతకు దిశానిర్దేశం చేస్తారు. 

Back to Top