వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వైయస్ఆర్సీపీ మద్దతు
02 Mar 2017 1:45 PM
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరిగే పట్టభధ్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసన మండలి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్)కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు గురువారం పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్సీలు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఇందుకు వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, టీచర్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బాలసుబ్రహ్మణ్యంకు వైయస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన అజయ్ శర్మకు మద్దతిస్తున్నట్లు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు వీరి గెలుపునకు కృషి చేయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.