కేఈ ప్రభాకర్‌ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి

కర్నూలు: విద్యార్థులను కూలీలతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండు చేశారు. ఇటీవల వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న వారంతా కూలీలని కేఈ ప్రభాకర్‌ పేర్కొనడంతో విద్యార్థులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.  

 
Back to Top