జననేత పేరువింటే టీడీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయ్‌


విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెప్పగానే టీడీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు సుధాకర్‌బాబు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, బొప్పన భవకుమార్‌లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, మరోసారి జననేతపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు అవినీతిపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఎల్లుండి ప్రకాశం బ్యారేజీ వద్దకు చర్చకు రావాలని సవాలు విసిరారు. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అయినా టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు అవినీతిపై చర్చకు రమ్మంటే టీడీపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

తాజా వీడియోలు

Back to Top