వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు పార్థీనియం కలుపు మొక్కలాంటివాడు
08 Dec 2018 12:56 PM
అమరావతి: తెలంగాణా ప్రజానీయం ఇచ్చే తీర్పుతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్లేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబు ‘పార్థీనియం’ కలుపు మొక్కలాంటివాడు. ఈ కబళించే కలుపు మొక్క పంటలను నాశనం చేస్తుంది. ఈ కలుపు మొక్కను రైతులు పెరికేస్తారు. తెలంగాణా ప్రజానీకం ఇచ్చే తీర్పుతో చంద్రబాబు ‘పార్థీనియం’ లైఫ్ రాజకీయంగా ముగిసినట్టే. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలందరికీ ఒక్క విషయం బాగా అర్థం అయింది తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఏపీలో బాబు దోపిడీ నుంచి పుట్టిందేనని. అవినీతి బాబు ఒక్క కేసులో దొరికినందుకు, ఏపీ ప్రజలు చెల్లించుకుంటన్న భారీ మూల్యాల్లో ఇదొకటని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.