<br/>అమరావతి: రైతులు చితికిపోతున్నా అక్రమ సంపాదనతో బాబు వెలిగిపోతున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.వెలిగొండ ప్రాజెక్టుకు ఊపిరిపోసింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. నేనే పునాది వేశానంటూ చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత వెలిగొండ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెలిగొండ పనులు పరుగులు పెట్టిస్తామని, ప్రతి ఎకరాకు నీరిస్తామని హామీ ఇచ్చారు. <br/>