సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
కలిసికట్టుగా పోరాటం చేద్దాం
10 Apr 2018 12:13 PM
ఢిల్లీ: తమ శక్తిమేరకు ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. జల్లికట్టు ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడంతో సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టాల్సి వచ్చిందని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి తమతో కలిసి రావాలని, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కేంద్రం దిగివస్తుందని మిథున్రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు ఇకనైనా కళ్లుతెరిచి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినా లోక్సభలో చర్చకు రాలేదని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారు దిగిరాక తప్పదని అన్నారు.