దమ్ము.. ధైర్యం ఉంటే ఆది రాజీనామా చేయాలి



 వైయ‌స్ఆర్‌ జిల్లా : మంత్రి ఆదినారాయణ రెడ్డికి దమ్ము,  ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్యేలు ర‌వీంద్ర‌నాధ్‌రెడ్డి, అంజ‌ద్‌బాషా సవాల్‌ విసిరారు. ఆదినారాయణకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని వారు గుర్తు చేశారు. శుక్ర‌వారం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ప్రాంతాన్ని టీడీపీ అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి టీడీపీకి సిగ్గు ఉండాలని విమర్శించారు. పులివెందులను అభివృద్ధి ఎవరు చేశారనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని చెబుతారని వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి పుణ్యం వల్లే పులివెందుల ప్రాంతానికి నీరు వచ్చిందన్నారు.  90 శాతం పనులను వైయ‌స్ హయాంలోనే పూర్తి చేస్తే కేవలం 10 శాతం పనులు చేసి సొంత డబ్బా కొట్టుకోవడం టీడీపీకి తగదన్నారు. గండికోట ముంఫు బాధితులను అదుకోకుండా పులివెందులకు నీళ్లు ఇచ్చేశాం అని చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.  టీడీపీ ఎంపీలకి చిత్తశుద్ధి ఉంటే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాజీనామా చేసి కేంద్రంపై పోరాటం చేసింటే బాగుండేదని సూచించారు. చంద్రబాబును ప్రజలు నమ్ముకుంటే ఆయన వాళ్లను నట్టేటా ముంచారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానాన్నీ ఎదుర్కోలేని ప్రధాని మోదీ ఉపవాస దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని వారు ధీమా వ్య‌క్తం చేశారు.


Back to Top