డ్వాక్రా రుణమాఫీ ఏమైంది


హైదరాబాద్‌: ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణమాఫీ ఏమైందని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సీంగా చేసిన మొదటి ఐదు సంతకాలు ఏమయ్యాయని రోజా నిలదీశారు. డ్వాక్రా రుణాలపై వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఐదేళ్లలో మహిళలకు అప్పులే మిగిలాయని తెలిపారు. మహిళల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. ఆడపిల్లలను సర్వనాశనం చేస్తూ, వారి జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబును మహిషాసురుడు అనడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.
Back to Top