చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

కర్నూలుః నారాయణరెడ్డిని ప్రభుత్వమే పథకం ప్రకారం కుట్రపన్ని హత్య చేయించిందని వైయస్సార్సీపీ కర్నూలు జిల్లా నేతలు అన్నారు. టీడీపీ హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరక్షన్ లోనే వైయస్సార్సీపీ నేతల హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. గన్ మెన్ లను తొలగించి, సెక్యూరిటీ లేకుండా నిరాయుధులను చేసిన తర్వాత ప్రభుత్వం వైయస్సార్సీపీ నేతలను హత్యలు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణరెడ్డికి ఉన్న ప్రజాధారణ చూసి ఓర్వలేక పొట్టన బెట్టుకున్నారని,  ఇందుకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Back to Top