అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
‘తూర్పు’ స్వాగతం చరిత్రలో నిలుస్తుంది
12 Jun 2018 3:38 PM
కొవ్వూరు: రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు పలికే స్వాగతం చరిత్రలో నిలిచిపోతుందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం నాటి నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లా జిల్లాకు జనసందోహం పెరుగుతూ వస్తుందన్నారు. ఏ జిల్లాకు వెళ్లినా చంద్రబాబు మోసాలే.. దోపిడీనే దర్శనమిస్తున్నాయన్నారు. ప్రజలు వైయస్ జగన్ను కలిసి తమ కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. పశ్చిమ గోదావరిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతికి అంతేలేకుండా పోయిందని, 600ల వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి అమలు చేయలేదని ప్రజలు వైయస్ జగన్కు మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏ సామాజికవర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదని ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జీపై స్వాగతం పలికేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారన్నారు.