చంద్రబాబు చేతుల్లో తీవ్రంగా మోసపోయిన ప్రజలు జననేత జగన్మోహన్ రెడ్డి కోసం ఎదరురు చూస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత కోటగిరి శ్రీధర్ అన్నారు. కంచరపాలెం సభకు సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు రావడం శుభ సంకేతమన్నారు. వైయస్ జగన్కు ప్రజాదరణ పెరుగుతుందన్నారు. జన సంకల్పయాత,బహిరంగ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలిరావడం జగన్పై ప్రజలకు ఉన్న అభిమానం తేటతెల్లమవుతుందన్నారు. 2019లో వైయస్ జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు.