టీడీపీ పాలన అస్తవ్యస్తం..

లంచాలు ఇవ్వనిదే పనులు జరగడంలేదు..
వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య...
విజయనగరంః నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో గజపతినగరం నియోజకవర్గం అవినీతిమయం అయిపోయిందని  గజపతినగరం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్య అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణపనులు వేగవంతంగా సాగాయని టీడీపీ నాలుగున్నరేళ్ల కాలంలో కనీసం   బ్రాంచ్‌కెనాల్‌ కూడా పూర్తవ్వలేదన్నారు. గజపతి నగరంలో  బైపాస్‌ రోడ్డు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బైపాస్‌ రోడ్డు వేస్తే చాలా  ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థుల చదువుకోసం ప్రభుత్వం డిగ్రీ కాలేజి కూడా మంజూరు చేయాలని, టీడీపీ పాలనలో కనీసం స్థలసేకరణ కూడా జరగలేదన్నారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని, లంచాలు ఇవ్వనిదే పనిజరగడంలేదని విమర్శించారు.  జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గజపతినగరం నియోజకవర్గ ప్రజల చిన్న కోరిక అని  ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటిసారిగా మా నియోజకవర్గానికి రావాలని వైయస్‌ జగన్‌ను ఆయన కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top