వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
లోక్ సభలో వైయస్సార్సీపీ వాయిదా తీర్మానం నోటీస్
01 Aug 2016 10:55 AM
న్యూఢిల్లీః ఏపీకి ప్రత్యేకహోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది. పార్టీ ఎంపీలు హోదాపై చర్చకు పట్టబట్టనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా వైయస్సార్సీపీ ఆది నుంచి ముందువరుసలో ఉండి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని వైయస్సార్సీపీ రెండేళ్లుగా అలుపెరగని పోరాటాలు చేస్తోంది.
చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. హోదాను విస్మరించిన టీడీపీ, బీజేపీల దుర్మార్గకు వైఖరిని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.