మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ఆస్తులు అమ్మి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
22 Mar 2017 10:43 AM
ఏపీ అసెంబ్లీ: అగ్రిగోల్డ్ ఆస్తులు ఆమ్మి బాధితులకు న్యాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా సభలో వైయస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సమస్య కూడా ప్రధానమైందని పేర్కొన్నారు. ఇందులో 30 లక్షల కుటుంబాలు బాధితులుగా ఉన్నారని,. నిత్యం ఈ సమస్యపై ఎక్కడో ఒకచోట బాధితులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వేలాది మంది రోడ్డున పడ్డారని, 105 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ రూ.8 కోట్ల బకాయిలు ఉండగా, హాయ్ల్యాండ్ను స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బులు ఇచ్చి ఉంటే ఆత్మహత్యలు ఆగేవి అన్నారు. ఈ కేసుపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. ఇలాంటి సమస్యపై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇవ్వగా ప్రభుత్వం ఒప్పుకోలేదని మండిపడ్డారు.