సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. 291వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ సోమవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం శివారు నుంచి ప్రారంభం కాగా కొద్ది సేప‌టి క్రిత‌మే సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు, స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు. సాయంత్రం సాలూరు ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు. 
Back to Top