కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ప్రజాసంకల్పయాత్ర@2100 కి.మీ
22 May 2018 5:31 PM
- ఉంగటూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వైయస్ జగన్
పశ్చిమ గోదావరి జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలురాయిని దాటింది. పశ్చిమ గోదారి జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలో 168వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో 2100 కిలోమీటర్ల మైలు రాయిని వైయస్ జగన్ దాటారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు జననేత వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి పాదయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి పెంటపాడు, బోడపాడు క్రాస్ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. . మధ్యాహ్నం కాశిపాడు క్రాస్, చిలకం పాడు, మీదుగా ఉంగటూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. కాగా, ఈ నెల 14వ తేదీ ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్ను ఆవిష్కరించిన జననేత.. మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు.
ప్రజాసంకల్పయాత్ర సాగుతుందిలా...
0 - వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)
100 - కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్ 7,2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్ రోడ్స్ (డిసెంబరు 24, 2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)
1200 - ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామకృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నాగులపాడు (మార్చి 5, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్ (ఏప్రిల్ 7, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్ 18, 2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్ 29, 2018)
2000- పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాపుంర (మే 14, 2018)
2100- పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు నియోజకవర్గం ( మే 22, 2018 )
జిల్లాల వారీగా ప్రజాసంకల్పయాత్ర ..
►నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం(161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
►వైఎస్సార్ జిల్లా: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడురోజులపాటు 94 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
►కర్నూలు జిల్లా: ఏడు నియోజకవర్గాల్లో 18 రోజులపాటు 263 కిలోమీటర్లు
►అనంతపురం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 279 కిలోమీటర్ల పాదయాత్ర
►చిత్తూరు జిల్లా: 10 నియోజకవర్గాల్లో 23 రోజుల పాత్రయాత్రో 291 కిలోమీటర్ల కాలినడక
►నెల్లూరు జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 267 కిలోమీటర్ల పాదయాత్ర
►ప్రకాశం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 21 రోజులపాటు 278 కిలోమీటర్లు
►గుంటూరు జిల్లా: 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోజులు 281 కిలోమీటర్ల యాత్ర
►కృష్ణా జిల్లా: 12 నియోజకవర్గాల్లో 24 రోజులపాటు 244 కిలోమీటర్లు
►పశ్చిమగోదావరి జిల్లా: మే 13న(ఆదివారం) మహేశ్వరపురం వద్ద వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. వెంకటాపుంర వద్ద ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.