మైలవరం నుంచి పాదయాత్ర ప్రారంభం

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జమ్ములమడుగు నియోజకవర్గం  ఎర్ర‌గుంట్ల‌ మున్సిపాలిటీ శివారు మైలవరం కాలువ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి ఇబ్బందులు విన్న వైయస్‌ జగన్‌ మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావం తెలిపారు. మరి కాసేపట్లో వైయస్‌ జగన్‌ పొట్లదుర్తి చేరుకుంటారు
 
Back to Top