హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సత్వరమే వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలను సత్వరమే ఆదుకోవాలని వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.