బస్సు ప్రమాదస్థలికి చేరుకున్న వైయస్ జగన్

కృష్ణాః  వైయస్ జగన్ బస్సు ప్రమాద స్థలికి చేరుకున్నారు. వైయస్ జగన్ వస్తున్నారని తెలిసి వైఫల్యాలు ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు సర్కార్ హడావిడి చేస్తోంది. ప్రమాదానికి గురైన బస్సును దూరంగా తరలించేందుకు యత్నించింది.  నందిగామలో మృతదేహాలకు హడావిడిగా పోస్టుమార్టం  నిర్వహిస్తున్నారు. ఉదయం వేళ పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11మంది చనిపోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను,  బాధిత కుటుంబాలును వైయస్ జగన్ పరామర్శించనున్నారు.

Back to Top