మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
అశ్రునయనాల మధ్య నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తి
22 May 2017 4:46 PM
కర్నూలు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జ్ నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి . అశ్రునయనాల మధ్య నారాయణరెడ్డికి వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వీడ్కోలు పలికారు. అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి నారాయణరెడ్డి స్వగ్రామం చెరుకులపాడుకు చేరుకున్నారు. నారాయణరెడ్డి పార్ధీవదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏ కష్టం ఎదురైనా మీకు నేను అండగా ఉంటానని వైయస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. నారాయణరెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు వేలాది మంది అభిమానులు తండోప తండాలుగా తరలివచ్చారు. అడుగుతీసి అడుగేయలేని జనసంద్రం మధ్య నారాయణరెడ్డి అంతిమయాత్ర సాగింది. నారాయణరెడ్డి అనుచరులు, పార్టీ నాయకులు బోరున విలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతల దాడిలో హత్యకు గురైన నారాయణరెడ్డి అనుచరుడు సాంబశివుడు అంత్యక్రియలు చెరువుకులపాడు గ్రామంలో పూర్తయ్యాయి.