13వ రోజు పాద‌యాత్ర ప్రారంభం

 కర్నూలు : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాద‌యాత్ర 13వ రోజు ప్రారంభ‌మైంది. సోమవారం ఉదయం జ‌న‌నేత బనగానపల్లి నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్రను ప్రారంభించారు. బాతులూరుపాడు, ఎన్నకొండల మీదుగా ఉదయం 10.30 గంటలకు హుశ్సెనాపురం చేరుకుంటారు. హుశ్సెనాపురంలో మ‌హిళా స‌ద‌స్సులో వైయస్ జ‌గ‌న్ పాల్గొంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మూడు గంటల సమయంలో హుశ్సేనాపురం నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. పాలుకూరు క్రాస్‌రోడ్డు, గోవిందదిన్నెల మీదుగా డోన్‌ నియోజకవర్గంలోకి  వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద వైయ‌స్‌ జగన్‌కు డోన్‌ నియోజకవర్గ పార్టీ నేతలు, ప్రజలు ఘనస్వాగతం పలుకుతారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో మాట్లాడతారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగుస్తుంది. రాత్రికి వైయ‌స్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు.
Back to Top