'బాబుకు ఓటు వేసి మేము చాలా పాపం చేసాం'

ఏటా మూడు పంటలు పండించుకునే తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రాజధాని ప్రాంతంలోని కిష్టాయపాలెంకు చెందిన రైతు బోయపాటి సుధారాణి స్పష్టం చేశారు. తమ భూములను లాక్కోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై ఆమె ఆగ్రహం వెలిబుచ్చుతూ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ భూములివ్వబోమని ఆయా గ్రామాల్లో రైతులు చేస్తున్న ఊరేగింపులను కూడా వీడియోలో ప్రదర్శించారు.

Back to Top