మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
విశాఖపట్నంలో జగన్ కోసం 'జనం సంతకం'
23 Dec 2012 10:45 AM
విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని జైలులో అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. శ్రీ జగన్పై కుట్రలకు వ్యతిరేకంగా 'జనం సంతకంస పేరుతో కోటి సంతకాలు సేకరించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ శనివారం మొదలైంది. వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు.
శ్రీ జగన్మోహన్రెడ్డిపై రాజకీయంగా బనాయించిన కేసులను తీవ్రంగా గర్హిస్తున్నామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఖండించారు.
శ్రీ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా కేంద్రంలోని కొందరు పెద్దలు అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా పలువురు మండిపడ్డారు. శ్రీ వైయస్ జగన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని విమర్శించారు. సేకరించిన కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని శ్రీ జగన్ అభిమానులు పేర్కొన్నారు.